అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో విష్ణు అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కార్తీక్ ,సత్య , మోహన్ అనే మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ధర్మపురి నుండి హైదరా బాద్ కు బైక్ వెళ్తుండగా ప్రమాదం చోటుచే సుకుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుత్తిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
0
283
Previous article
Next article
Latest Articles
నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా
హైదరాబాద్: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్ వ్యాపారులు...
- Advertisement -
- Advertisement -


