త్వరలో వికసిత్ కశ్మీర్కల సాకారం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్ను ఎవరూ పట్టిం చుకోలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్ నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతో షంగా ఉందన్నారు. జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారం భించి జాతికి అంకితం చేశారు. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. కుటుంబ రాజకీ యాలు చేసేవాళ్లు.. వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారని అన్నారు. జమ్ముకశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


