Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దేవదేవున్ని దర్శించుకునేందుకు తెల్లవారుఝాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 57,354 మంది భక్తులు దర్శించుకుకున్నారు. అలాగే 24,398 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.