కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు రూటు మార్చారు. మొన్నటి వరకు అదానీపై విమర్శలు గుప్పిం చిన అగ్రనేత.. ఇప్పుడు బాలీవుడ్ నటులపై బాణాలు ఎక్కుపెట్టారు. అదానీ లాంటి వ్యక్తులకే మోదీ లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారంటూ ఇన్నాళ్లూ కామెంట్లు చేశారు రాహుల్. ఇప్పుడు రూటు మార్చిన రాహుల్.. తాజాగా బాలీవుడ్ నటులను టార్గెట్ చేశారు. మోదీని విమర్శించే సందర్భంలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్లను మధ్యలోకి లాగారు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఐశ్వర్యరాయ్పై తాజాగా రాహుల్ గాంధీ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయనేతలు, సినీ తారలు రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మహిళలను కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో మండిపడు తున్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన రామమందిర ప్రారంభోత్సవం గురించి మాట్లాడారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు, వెనకబడిన వర్గాలు కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు. పారిశ్రామికవేత్తలు, అమితా బచ్చన్ను ఆహ్వానించడం ద్వారా జనాబా లో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టైందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ తరువాత మరో ర్యాలీలో మాట్లాడుతూ ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే, అమితాబ్ బల్లే బల్లే అంటారని కామెంట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మహిళలను అవమానించారంటూ సినీ గాయని సోనా మొహాపాత్ర మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నిం చింది. సాటి కన్నడ వ్యక్తిని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్య చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది.


