24.3 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

వివాహితను కిడ్నాప్‌ చేసిన ముగ్గురు మహిళలు

              వివాహితను సినీఫక్కీలో ముగ్గురు మహిళలు అపహరించి కారులో తీసుకెళుతుండగా అప్రమత్తమైన పోలీ సులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్‌ చేస్తోందని గోకవరానికి చెందిన ఓ వివాహితపై కొవ్వూరుకు చెందిన మహిళ అనుమానం పెంచుకుంది. ఆమెను ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవాలని తన గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి కారులో గోకవరం చేరుకుంది. అక్కడ మరో మహిళ సాయం తీసుకొని వివాహిత ఇంటి సమీపంలో కాపు కాసి, అటుగా వెళుతున్న ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్దే ఉన్న వివా హిత భర్త జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన ఎస్సై నాగరాజు.. టెక్నాలజీ ఆధారంగా కారు ఉన్నచోటును కనుగొని అక్కడకు చేరుకొన్నారు. నిందితుల చెర నుంచి వివాహితను విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు ముగ్గురు మహిళలపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్