30.2 C
Hyderabad
Sunday, November 2, 2025
spot_img

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం

        మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్ష తన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించ నున్నారు. ముఖ్యంగా 500కు గ్యాస్‌ సిలిం డర్‌, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు పథకాల అమలు పై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇవ్వడంతో.. వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో.. రాష్ట్రంలోనూ ఇదే తరహా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తారని సమాచారం. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. 9న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 10న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. 11న ఆదివారం సెలవు. తిరిగి 12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్