25 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

భూమా, ఏవీ మధ్యలో చంద్రబాబు

       ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఆళ్లగడ్డలో రా కదలి రా బహిరంగ సభలో చంద్ర బాబు పాల్గొన్నారు. అయితే, ఆళ్లగడ్డ సభకు టీడీపీ సీనియర్ నేత ఏ. వి. సుబ్బారెడ్డి రాకూడదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వర్గం అంటోంది. ఏవి వస్తే వేదికపైకి పిలిచేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. చంద్రబాబు సభ సాక్షిగా టీడీపీలో విభేదాలు బయటపడనుండడంతో ముందుగానే అలర్ట్ అయ్యింది అధిష్టానం. ఏవి సుబ్బారెడ్డి తో మాట్లాడి ఆయనకు నచ్చచెప్పింది. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డిని మాజీ మంత్రి ఫరూక్ కార్యాలయంలో ఆయన సమక్షంలో చంద్రబాబు సభ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి చర్చలు జరిపారు. అళ్ళగడ్డలోని పరిస్థితులను ఏవికి చౌదరి వివరించారు.చంద్రబాబు సభ విజయవంతం కావాలని చెప్పారు. పార్టీ కోసం సభకు రానని చెప్పిన ఏవి సుబ్బారెడ్డి, సభను విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్