22.8 C
Hyderabad
Tuesday, February 24, 2026
spot_img

పొలిటికల్ కాకరేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు

        తెలంగాణలో రెండు, మూడేళ్లలో అధికారంలోకి వస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం.? పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా…?ప్రభుత్వం పదవీ కాలం ఐదేళ్లు అయితే బీఆర్ఎస్  రెండు, మూడు ఏళ్ళల్లో అధికారంలోకి వస్తుంది…? ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉందా…? లేక పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారా…? అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

     బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారా యి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్  తగ్గించేందుకు బీఆర్ఎస్ పార్టీ నానా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్ష సమావేశాలను నిర్వ హించింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్య లు చేశారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో అధికారం మనదేనని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

      కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ మాటల వెనుక దాగి ఉన్న మర్మమేంటని రాజకీ య వర్గాల్లో టాక్ నడుస్తోంది. రెండు, మూడేళ్లలో అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేశారు.మరి రెండు, మూడేళ్ళకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ గెలుపులో హ్యాట్రిక్ గెలుపు దూరం అయిందని కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారా అనే వాదన సైతం వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు ప్రధాని మోదీ టాస్క్ ఇచ్చారని, బీఆర్ఎస్ సంగతి చూడటానికి మోదీ మద్దతు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కేటీఆర్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం సైతం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు అయ్యాయనే వాదన బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది.

      తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని ఆ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ అధి నాయకత్వం తమ శ్రేణులకు చెప్తూ వస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుందని తద్వారా బీఆర్ఎస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

       బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని భావిస్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే విధంగా వ్యాఖ్యలు సైతం బాహాటం గానే చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సాధారణంగా ఏ ప్రభుత్వానికి అయినా కొంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు సైతం కాకముందే ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడో ఒక చోట బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

      పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు తమకు అనుకూలంగా మారతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. తాము అనుకున్నట్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆసరాగా చేసుకుని ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి సైతం సహకా రం అందుతుందని బిఆర్ఎస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ,క్యాడర్ కు తెలియచేస్తూ వారు అధికార పార్టీ వైపుకు చూడకుండా వుండే ప్రయత్నాలు చేస్తున్నారు.

      అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని తొలగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 కు పైగా మున్సిపా లిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాడర్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారంతా పార్టీ మారకుండా ఉండాలంటే వారికి ఏదో ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అధిష్టానంపై ఉంది. అందు లో భాగంగానే పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారకుండా జాగ్రత్త పడుతున్నారు.మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న విధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో రాజకీయ మార్పులు ఏమైనా జరుగుతాయా లేదా అనేది చూడాల్సిందే…

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్