Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

దక్షిణాదిపై దృష్టి పెట్టిన ప్రధాని మోదీ – రెండు రోజులు రాష్ట్రాల్లో పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస పర్యటనల్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు, రేపు తమిళనాడు, లక్షద్వీప్‌, కేరళలో పర్య టించనున్నారు. 19,850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు విమానయానం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్, ఉన్నత విద్య వంటి వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,112 కోట్ల రూపాయ లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండు స్థాయి అంతర్జాతీయ టెర్మినల్ ప్రయాణీకుల సౌక ర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఏటా 4.4 మిలియన్‌ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తిరుచిరాపల్లిలోని భారతీ దాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొంటారు. యూనివర్శిటీ హాల్‌లో 33 మందికి పట్టాలను ప్రదానం చేశాక ప్రసంగిస్తారు. రెండు కార్యక్రమాల్లోనూ తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్. రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొంటారు.

మోదీ పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమతారని సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతోపాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని తెలిసింది. ఆ తర్వాత ప్రధాని మోదీ లక్షద్వీప్‌లోని అగట్టికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. జనవరి 3వ తేదీ మధ్యాహ్నం కవరత్తి, లక్షద్వీప్‌కు చేరుకుని, టెలికమ్యూనికేషన్స్, తాగునీరు, సోలార్ పవర్, ఆరోగ్యం వంటి రంగాలలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ రేపు కేరళలోని త్రిసూర్‌ సందర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలను త్రిసూర్‌ మున్సిపాలిటి సిబ్బంది తొలగించారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు త్రిసూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎం బోర్డులు, ఫ్లెక్సీలకు వర్తించని నిబంధనలు బీజేపీకి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. మరోవైపు మోడీ త్రిసూర్‌ పర్యటన నేపథ్యంలో మహిళా మోర్చా కార్యకర్తలు మెగా తిరువథిర పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు రెండు వేల మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు అభ్యాసం చేశారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్