ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశాలను నిర్వహించనుంది. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. ఇవాళ ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం జరగ నుంది. జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించను న్నారు. మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విసృత్త జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ సమావేశాలు జరగను న్నాయి. రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించను న్నారు. 2024 లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించనున్నారు. పార్టీ ఎన్నికల ప్రచార సారధిగా కూడా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీనడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ… జాతీయ కౌన్సిల్ లో తీర్మా నం చేయనున్నారు. రెండు రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తెలుపు తూ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు.


