23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

టీడీపీ – బీజేపీల పొత్తు పొడవనుందా ?

     ఒకప్పుడు రాజకీయాల్లో ఎంతోకొంత విలువలు ఉండేవని సీనియర్ నేతలు బాధపడుతూ కనిపిస్తారు. రాజకీయాల్లో రాన రానూ మరింతగా దిగజారుతున్న పరిస్థితే కనిపిస్తుంది. అధికారం కోసం ఏం చెయ్యా లనేది అప్పటి నేతలు ఆలోచిస్తే, ఏం చేసైనా అధికారం దక్కించుకోవాలనే ఆలోచనా విధానం ఇప్పటి నేతల విధానాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు…శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. తాజాగా ఇదే విషయం ఇదే నిజం కాబోతుందనే చెప్పాలి. పాత మిత్రులు టీడీపీ, బీజేపీలు మళ్లీ చేతులు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే వారం ఎన్డీఏలో టీడీపీ చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న లేదా 20న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం . మరోవైపు ఈరోజు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగను న్నాయి. లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమా యత్తం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ సమావేశాల అనంతరం పొత్తులపై పార్టీ హైకమాండ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ నెల 20న చంద్రబాబు, పవన్ లతో బీజేపీ అగ్ర నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని సమాచారం. సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక అవగా హనకు వచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్డీఏలో చేరే ఇతర పార్టీల అధినేతలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్