కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు మాజీ మంత్రి హరీశ్రావు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ మడమ తిప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్కు ఓటేయండని.. రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయమని కోరారు. వచ్చే ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని హరీష్రావు పిలుపునిచ్చారు.


