Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సన్నాహాలు

            పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో ఈ సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం ఉంది. అయోధ్య రామమందిరం విజయ వంతంగా ప్రారంభం కావడంతో ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఈ సమావేశాలకు సన్నద్ధమవుతున్నా యి. ఇండియా అలయన్స్ నుంచి ఒక్కో పార్టీ దూరమవుతుండడంతో గందరగోళంలో ప్రతి పక్షాలు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర హుషారుగా సాగుతుండడం కాంగ్రెస్ కు గొప్ప ఊరట.

       పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల నుద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యం తర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సన్నాహం తుది దశలో సాంప్రదాయకంగా చేసే హల్వా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నరేంద్రమోదీ సర్కార్ రెండో టర్మ్ లో చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా ఈ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు.

        బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు బడ్జెట్ సమావే శాలకు ముందే.. ప్రతిపక్ష ఎంపీలపై గల సస్పెన్షన్ ను తొలగించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం, ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్ సభలో దూకి హల్ చల్ చేసిన ఘటన, ఈ ఘటనపై ప్రధాని, హోం మంత్రి ప్రకటనకు ప్రతి పక్షాలు పట్టుపట్టిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు అంతరాయం కల్గిస్తున్నారన్న సాకుతో శీతాకాలం సమావేశాల్లో ఉభయసభ ల్లోనూ దాదాపు 146 మంది అన్నిపార్టీలకు చెందిన ప్రతి పక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం తరుపున రాజ్యసభ చైర్మన్ కు, లోక్ సభ స్పీకర్ కు తాను విజ్ఞప్తి చేయడంతో సభ్యుల సస్పెన్షన్ తొలగించేందుకు ఉభయులూ అంగీకరిం చినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.

        తొలిసారిగా 2023-24 కేంద్ర బడ్జెట్ ను పేపర్ లెస్ ఫార్మెట్ లో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక ప్రకటన, గ్రాంట్ల డిమాండ్, ఫైనాన్స్ బిల్లుతో సహా మొత్తం 14 కేంద్ర బడ్జెట్ పత్రాలను “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్” ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ప్రభుత్వం కొన్ని పెండింగ్ బిల్లులను ఈ సమావేశంలో ఆమోదింపజే సుకునేందుకు యత్నించవచ్చు. కాగా, ధరలపెరుగుదల, నిరుద్యోగంతోపాటు, మణిపూర్ లో పరిస్థితి, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఎదురవుతున్న అడ్డంకులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. బీహార్ రాజకీయ పరిణామాలు కూడా పార్లమెంటులో ప్రస్తావనకు రావచ్చు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠ .. క్రెడిట్ పొందేందుకు బీజేపీ, ప్రధాని మోదీ.. తమవంతు కృషిచేస్తారన్నది నిర్వివాదాంశం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగుస్తాయి. ఇక ఏప్రిల్ – మే నెలల్లో ఎన్నికల తర్వాతే.. మళ్లీ పార్లమెంటు సమావేశాలు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్