తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చారు బిజెపి మాజీ ఎంపి సుబ్రమణ్యం స్వామి. టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఓ పత్రికపై టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆ పత్రికపై వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు సుబ్ర మణ్యం స్వామి. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై.. టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారాయన. న్యాయ వాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసింది కోర్టు. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదన్నారు సుబ్రమణ్యం స్వామి. హై కోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చానని.. కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చానని చెప్పారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందని చెప్పారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకే అసత్య వార్తను ప్రచురించారని.. దేవస్థానం అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించిందని చెప్పారు.