మరో ఇండియన్ – అమెరికన్ స్టూడెంట్ సమీర్ కామత్ శవమై కన్పించాడు. 23 ఏళ్ల సమీర్ కామత్ పర్డ్యూ యూని వర్సిటీ విద్యార్థి. ఇండియానా లోని విలియమ్స్ పోర్ట్ లోని ప్రకృతి సంరక్షణ కేంద్రంలో శవమై కన్పిం చాడు. అతడు తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తలకు తగిలిన బులెట్ గాయంవల్లే కామత్ మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అమెరికాలో రెండు వారాల్లో ఇది ఆరో భారతీయ విద్యార్థి మరణం. సమీర్ కామత్ 2023 ఆగస్టులో పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారని, అతను అమెరికా పౌరుడని కరోనర్ కార్యాలయం ధృవీకరించింది.


