Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

సైబర్ నేరాలు అరికట్టడంలో పోలీసులకు ట్రైనింగ్

      తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ నేరాలపై వర్క్ షాప్ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్ట ర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ రవిగుప్త పలువురు పోలీస్ ఉన్న త అధికారులు హాజరయ్యారు.

       తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వర్క్ షాప్ నిర్వహించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ కి డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై వర్క్ షాప్ జరిగింది. తనకు కూడా సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వచ్చాయన్నారు డీజీపీ రవి గుప్తా. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్స్ కొడితే డబ్బులు పంపిస్తామని కాల్స్ చేశారన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయని.. సైబర్ నేరగాళ్లు ప్రజలను ఈజీగా మోసం చేస్తున్నారన్నారు. బిగ్ బాస్కెట్ లో తన డేటా కూడా లీక్ అయిందని, సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యమని డీజీపీ రవిగుప్తా చెప్పారు.

     ఇదిలా ఉంటే సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని.. ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారు, మధ్య తరగతి వారే నేరాల బారిన పడుతున్నారని వివరించారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

      రాష్ట్రవ్యాప్తంగా 870 మంది కానిస్టేబుళ్లకు సైబర్ నేరాలు అరికట్టడంలో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు సైబర్ సెక్యూ రిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్. భవిష్యత్ లో ఫిజికల్ క్రైమ్ కన్నా సైబర్ నేరాల కేసులే ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారెవరైనా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి కంప్లెయింట్ చేయాలని సూచించారు. మోస పోమామని గ్రహించి.. తొందరగా కంప్లెయింట్ చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.. ఇప్పటివరకు 130 కోట్ల మనీని హోల్డ్ లో పెట్టామని చెప్పారు.ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పు డు రెచ్చిపోతూనే ఉన్నారు. అందుకే రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అంతిమంగా సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్