బ్రిటన్ లో దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించారు. బ్రిటీష్ ప్రధాని రిషిసునాక్ ఈ నిషేధాన్ని అమలు చేసి చూపారు. విద్యా బోధన సమయంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వినియోగించడం వల్ల తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో యూకే ప్రధాని రిషి సునక్ ఇంగ్లాండ్ లోని అన్ని పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషే ధాన్ని అమలు చేశారు. పాఠ్యాంశాల బోధన, అభ్యసన సమయం లో ఏకాగ్రతతో కూడిన వాతావరణానికి ఫోన్ల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. చెబుతూ.. సునక్ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో వీడియో సందేశం ద్వారా ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఫోన్ నిషేధాన్ని అమలు చేస్తున్న పాఠశాలల్లో చక్కటి ఫలితాలు వస్తున్నాయి. క్యాంపస్ లో ఫోన్లను నిషేధించడం వల్ల, ప్రధానోపా ధ్యాయులు రోజంతా ఫోన్ వాడకాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది.