లోక్సభ ఎన్నికల వేళ.. బిహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడేక్కాయి. గంటకో ట్విస్ట్తో అక్కడి రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవాళ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది. కూటమికి జేడీయూ గుడ్బై చెప్పడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. రేపు సీఎం..గవర్నర్ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి నితీష్ రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే చాన్స్ ఉంది.తాజా పరిణామాల నేపథ్యంలో నేడు జేడీయూ ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానున్నారు. మధ్యా హ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియా లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
మరోవైపు అమిత్షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ హాజరయ్యాయి. బీహార్లో జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం. జేడీయూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను..ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ కూటములను తరచూ మార్చే నీతీశ్ కుమార్ తాజా మార్పునకు కార ణాలను విశ్లేషిస్తే.. తన సంకీర్ణ భాగస్వాములైన RJD, కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబం ధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అధికార భాగస్వామి RJDతో నీతీశ్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వీయాదవ్, తేజ్ప్రతాప్ యాదవ్లు కీలక శాఖలు నిర్వహిస్తూ.. ముఖ్య నిర్ణయాలు తీసుకునే టప్పుడు నీతీశ్తో సంప్రదించడంలేదని తెలిపాయి. దీంతో నీతీశ్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనై వారిపై విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనుగడకు ముప్పువాటిల్లుతుందని కఠినంగా వ్యవహరించలేకపోతున్నా రు. దీనికి తోడు నీతీశ్ చేసిన కుటుంబ రాజకీయాల వ్యాఖ్యపై లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయన్ను ఇబ్బందిపెట్టింది.
గత నవంబరులో తేజస్వీ యాదవ్ బిహార్ భవిష్యత్ ముఖ్యమంత్రంటూ RJD నెలకొల్పిన పోస్టర్లు నీతీశ్లో అల జడి రేకెత్తించాయి. వీటికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చివేత ధోరణి ఆయన్ను విసుగె త్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాం గ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జ్వాలలపై ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన్ను మళ్లీ NDA వైపు చూసేలా చేశాయి. గతంలో JDU చాలా కాలం NDAలో భాగస్వామిగా ఉండేది. తరువాత RJDతో చేయి కలిపింది.