సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ, జనసేన గెలుపు ఖాయమని సినీ నటుడు సుమన్ అన్నారు. తిరుపతిలో గంగమ్మను దర్శించుకున్న ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయాలని ఆహ్వా నించారని తెలిపారు. అయితే తన రాజకీయ గురువు చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళ లకు రక్షణ లేదన్నారు. ఏపీలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. తమిళ నటుడు విజయ్ రాజకీయంగా పక్కా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని సుమన్ చెప్పారు.


