హైదరాబాద్ లో క్యాంప్ చేస్తున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఆరా తీశారు. ఝార్ఖండ్ లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బలనిరూపణకు ముందు ఎలాంటి బేరసారాలు జరగకుండా.. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లోని ప్రైవేటు రిసార్ట్ లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. వారికి కలిసేందుకు మీడియా ను కూడా అనుమతించలేదు.
ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో రేపు బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు శామీర్పేటలోని ఓ రిసార్టుకు తరలించారు. వీరంతా రేపు ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది. వీరి రక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బలపరీక్షలో పాల్గొనేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఝార్ఖండ్ మాజీ సీఎం బల నిరూపణకు హైకోర్టు అనుమతి
Latest Articles
- Advertisement -