Site icon Swatantra Tv

లుకౌట్‌ నోటీసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన రాహిల్‌

     మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రగతిభవన్‌ దగ్గర యాక్సిడెంట్‌ కేసులో తనపై లుకౌట్‌ నోటీసులను కొట్టివేయాలని పిటిషన్‌ వేశాడు. డిసెంబర్ 24న ప్రగతి భవన్ ముందు భారికేడ్‌ను ఢీ కొట్టిన రాహిల్‌ .. తనకు బదులుగా డ్రైవర్‌ను లొంగిపోయేలా ప్రేరేపించాడు. ఈ కేసులో రాహిల్‌తో పాటు తండ్రి షకీల్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇద్దరిపై లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.. దుబాయ్‌లో ఉన్న రాహిల్‌ను రప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. రాహిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

Exit mobile version