Site icon Swatantra Tv

మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లినా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుమాం డ్ల ఝాన్సీ రెడ్డి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంతో కొట్టుకున్నారు. మడిపెల్లి గ్రామానికి హుటాహుటిన పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిం చారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు యశస్విని రెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తిని నేనున్నానని భరోసానిచ్చి వివరాలు తెలుసుకున్నారు.

Exit mobile version