Site icon Swatantra Tv

పార్లమెంటులోపల దాడి చేసిన కేసు

      గత డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోక్ సభలో హల్ చల్ చేసిన కేసులో నింది తులను నేడు కోర్టులో హాజరు పరచారు. వారు ఆరుగురు తమ న్యాయవాదిని మార్చు కున్నారు. వారందరి తరుపున ఒకే న్యాయవాది వాదించనున్నారు. దీంతో కోర్టు వారి కేసు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. వారి జుడీషియల్ కస్టడీని కూడా అప్పటివరకూ కోర్టు పొడి గించింది. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని నిందితులలో నీలం అజాద్ కోర్టుకు విన్నవిం చారు. తనకు ఎక్స్ రే తీయించినా, మెడిసిన్ కల్పించడం లేదని పేర్కొన్నారు. నిర్దిష్ట మైన దరఖాస్తును కోర్టుకు సమర్పించాలని నీలం తరుపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

Exit mobile version