Site icon Swatantra Tv

బ్రేకింగ్: నేడు ఢిల్లీకి వై.ఎస్. షర్మిల

YS Sharmila

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిల ఢిల్లీ బాట పట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు .

తాజా పరిణామాలపై షర్మిల((YS Sharmila)) స్పందిస్తూ.. రాష్ట్ర రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా? అంటూ మండిపడ్డారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించడం సంతోషకరమని తెలిపారు. అదే మేము మీకు వందల సార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు… మీలో చలనం ఎందుకు రాలేదు? అనిప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? అని నిలదీశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలు అంటే మీకు కనపడలేదు.. కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అని అవమానపరిచినా మీకు కనపడలేదా అని డిమాండ్ చేశారు.

Read Also: ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

Follow us on:   Youtube   Instagram

Exit mobile version