Site icon Swatantra Tv

ఇచ్ఛాపురం నుంచి వైసీపీ బస్సు యాత్ర..షెడ్యూల్‌ ఇదే

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమైన వైసీపీ షెడ్యూల్ ఖరారు చేసింది. తొలి విడత యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈనెల 26న ప్రారంభించేందుకు సిద్ధమైంది. నవంబర్ 9 వరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. పార్టీలోని ఆయా వర్గాల సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొని సభల్లో ప్రసంగించనున్నారు. కాగా, ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version