Andrapradesh: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు.ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ… చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు తొత్తుగా మారుతున్నారని అన్నారు. ఇది బాబు విజయం కాదుని.. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ వేసిన వాళ్లు ప్రజాభిమానం లేని ఎమ్మెల్యేలని వ్యాఖ్యానించారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇది బ్లాక్ డేనని పేర్కొన్నారు.