స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఒకదానినొకటి వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరొక వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. మృతులు దొంగస్వామి, రమేష్, కృష్ణగా గుర్తించారు. మమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.