- హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
- పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు
- 50 విభాగాల్లో 6500 అంకురాలు ఉన్నాయన్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ గమ్యస్థానం అని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే… ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ను ఎంచుకున్నారని చెప్పారు. తెలంగాణలో 50 విభాగాల్లో 6,500 అంకురాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.