34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

తెలంగాణ నాడి… ‘ స్వతంత్ర ’ సర్వే

మరో ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అనేది ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. రెండు నెలల్లో తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టే సర్వేని ‘స్వతంత్ర టీవీ’ చేసింది. అయితే ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలవారీగా సర్వే సాగింది. ఇందులో సెప్టెంబరు, నవంబరు రెండు నెలల్లో ఓటర్ల సర్వే జరిగింది. మొత్తం ఆరు ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాన్ని ప్రజలకిచ్చి అడగడం జరిగింది. వాటిలో

1) మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా? 2) మీ ఊళ్లో అభివృద్ధి జరిగిందా?

3) ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు పనితీరు బాగుందా?

4) మీకు ప్రభుత్వ సాయం అందుతోందా?

5) తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని అనుకుంటున్నారా?

6) టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?

ఇలా ప్రింట్ చేసిన కాగితాన్ని ప్రజలకిచ్చి అడగడం జరిగింది. వాళ్లందరూ చాలా ఉత్సాహంగా సర్వేలో పాల్గొన్నారు.

ఇలా 119 నియోజకవర్గాల్లో తెలంగాణ నాడిని బట్టి చూస్తే

టీఆర్ఎస్  59

కాంగ్రెస్    31

బీజేపీ       16

ఎంఐఎం   07  

పోటాపోటీగా 06  స్థానాల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

అయితే సంవత్సరం తర్వాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రజల నాడిని బట్టి చూసి, మరి పార్టీలు ముందడుగు వేస్తాయా? లేక వెనుకబాటులోనే ఉంటాయా? లేక వ్యూహాలు మార్చి ముందుకెళతాయా? లేక లుకలుకలతోనే కాలం గడిపేస్తాయా? లేక తిట్టుకుంటూనే కాలక్షేపం చేస్తాయా? లేక ఏమైనా మిలాఖత్ లు అవుతాయా ? అనేది తెలియాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే. వేచి చూడాల్సిందే.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్ కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్