38.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని షర్మిల హామీ.! -పాదయాత్రలో కల్లుతాగిన షర్మిల.!

  • స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
  • లక్ష్మీనారాయణపురం స్టేజ్ వద్ద గీత కార్మికులతో మాటామంతీ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల పాదయాత్ర 236వ రోజు జనగాం నుంచి ప్రారంభమై.. నెల్లుట్ల, కుందారం, కిస్టగూడెం, చీటురు గ్రామాల మీదుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా లక్ష్మీనారాయణపురం స్టేజ్ వద్ద గీత కార్మికులను షర్మిల కలిశారు. గీత కార్మికుల కోరిక మేరకు వైఎస్‌ షర్మిల కల్లు టేస్ట్ చేశారు.

అలాగే, నెల్లుట్లలో సర్కార్ భూమిలో గుడిసెలు వేసుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న 802 పేద కుటుంబాలు షర్మిలను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి పరిస్థితిని చూసి చలించిన షర్మిళ ఆ గుడిసెలకు 15లక్షలతో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని YSRTP నాయకులను ఆదేశించారు.

Latest Articles

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం

        దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. ఈస్టర్‌ పండుగ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్