30.2 C
Hyderabad
Thursday, June 8, 2023

తెలంగాణకు పెప్సికో గుడ్‌న్యూస్..!

  • హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపునకు నిర్ణయం
  • దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో..
  • మంత్రి కేటీఆర్ ప్రముఖ వ్యాపార వేత్తలతో భేటీ
  • హైదరాబాద్‌లో మల్టీ గిగావాట్ ఎల్సీ తయారీ కేంద్రం
  • ప్రకటించిన అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీల ఉత్పత్తి

తెలంగాణకు పెప్సికో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో.. మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు పెప్సీకో ప్రతినిధులు. హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులను 2,800 నుంచి 4 వేలకు పెంచుతున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సెంటర్‌ కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు పెప్సీకో తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దీని ద్వారా 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రతిపాదిత కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీల ఉత్పత్తి చేయనుంది.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్