ప్రముఖ హాస్య హీరో నరేష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. విజయనిర్మల తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదట్లో హీరో గా రాణించారు. ముఖ్యంగా హాస్య సినిమాల్లో ఎక్కువగా నటించేవారు. తర్వాత కాలంలో కామెడీతో కూడిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ఇప్పటికే నరేష్ కు మూడు సార్లు పెళ్లిళ్లు జరిగాయి. మూడో భార్య రమ్యతో ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. అనేక సార్లు గొడవలు రచ్చకు ఎక్కాయి కూడా. ఈ సమయంలో పవిత్ర లోకేష్ తో అనుబంధం గుప్పుమంది.
ఇటీవల సూపర్ స్టార్ క్రిష్ణ మరణించినప్పుడు నరేష్ వెన్నంటి ఉంటూ పవిత్ర అన్నీ చక్క బెట్టుకొంటూ వచ్చారు. అప్పుడే పవిత్ర తో నరేష్ కు పెళ్లి ఫిక్స్ అయిందని సినీ వర్గాలు గుసగుసలాడుకొన్నాయి. తగినట్లుగానే చాలా సందర్బాల్లో నరేష్, పవిత్ర జంటగా కనిపిస్తూ వచ్చారు. ముఖ్యమైన తెలుగు సినీ ప్రముఖులకు పవిత్ర ను నరేష్ చేయటం జరిగింది. ఈ క్రమంలో ఈ జంట దగ్గరవుతున్నారనే సిగ్నల్స్ అందరికీ అందాయి.
కన్నడ నటి పవిత్ర ది కూడా సినిమా కుటుంబమే. ఆమె తండ్రి లోకేష్ చాలా సినిమాల్లో నటించారు. మైసూర్ ప్రాంతంలో ఉండేవారు. తండ్రి బాటలో సినిమాల్లో ప్రవేశించిన పవిత్ర ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. మొదటి భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో విడిపోయాక నటుడు సుచేంద్ర ప్రసాద్ తో సహజీవనం చేశారు. ఈ రిలేషన్ కూడా ఫెయిల్ అయ్యాక నరేష్ కు ఆమె దగ్గరయ్యారు.
వివాదాలు ఎలా ఉన్నప్పటికీ నాలుగో పెల్లి చేసుకొంటున్నట్లు నరేష్ స్వయంగా కన్ ఫామ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియో రికార్డు చేసి మీడియా వర్గాలకు పంపించారు.