32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

స్వతంత్రలో మురళీధర్‌ రావు..!

  • న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
  • ఛానెల్‌ ఎండీ కృష్ణప్రసాద్‌తో ఆత్మీయ సమావేశం
  • స్వతంత్ర టీవీ ప్రసారాలను అభినందించిన మురళీధర్‌ రావు

హైదరాబాద్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్ రావు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని స్వతంత్ర న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ మరియు పయనీర్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణ ప్రసాద్ తో ఆత్మీయంగా సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ స్వతంత్ర టీవీ ప్రసారాలు జరుగుతుండటాన్ని మురళీధర్ రావు అభినందించారు. స్వతంత్ర టీవీ అనుసరిస్తున్న విధానాలు, టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకొన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా నిష్పక్షపాతంగా స్వతంత్ర టీవీ నిర్వహించిన సర్వే వివరాల్ని మురళీధర్ రావు తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా ఎండీ బి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్వతంత్ర టీవీ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను వివరించారు. ఈ తరం యువతలో జాతీయ భావాలు పెంపొందించేందుకు చేపట్టిన స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమ విశేషాలు తెలియ చేశారు. అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన ప్రమాణాలతో నికార్సయిన వార్తలు అందించేందుకు స్వతంత్ర టీవీ పనిచేస్తోందని వివరించారు. రాగల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వతంత్ర టీవీ చేపడుతున్న కార్యకలాపాల గురించి తెలియచేశారు. ఛానెల్ లోని అన్ని విభాగాల్ని ఎండీ కృష్ణ ప్రసాద్ తో కలిసి మురళీధర్ రావు పరిశీలించారు.

Latest Articles

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

  ఇరాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌ - ఇరాన్ మధ్య గతంలో పరోక్ష యుద్ధాలు నడిచాయి. అయితే ఈ రెండు దేశాలు ముఖాముఖి తలపడటం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్