35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషాకు కవలలు.!-300 కిలోల బంగారం దానం చేయాలని నిర్ణయం

  • అమెరికా నుంచి కవలలతో వచ్చిన ఈషా దంపతులు
  • ఐదు అనాథాశ్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రకటన
  • కవల పిల్లలకు వివిధ దేవాలయాల అర్చకుల ఆశీర్వచనం

దేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెద్దపండుగే జరిగింది. ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, అజయ్ పిరమల్ దంపతులకు అమెరికాలో కవలపిల్లలు పుట్టారు. కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఒకే కాన్పులో పాప, బాబు పుట్టారు. ముఖేశ్ అంబానీకి తాతగా ప్రమోషన్ వచ్చింది. అసలే అపర కుబేరుడు.. ఆపై తాత అయ్యాడు. ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ముఖేశ్ అంబానీ.. ఏకంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయాలని నిర్ణయించారు. 2018లో అంబానీ కుమార్తె వివాహం జరిగింది.

పండంటి మనుమడు, మనుమరాలితో వచ్చిన ఈషా అంబానీ దంపతులకు, అంబానీ, పిరమల్ కుటుంబాలు ఘనంగా స్వాగతం పలికాయి. కవలలు దేశంలోకి వస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల అర్చకులను రప్పించి ఆశీర్వచనం ఇప్పించారు ముఖేశ్ అంబానీ. మరో ప్రత్యేకత ఏమిటంటే.. కవలల సంరక్షణకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 8 మంది అమెరికన్ నానీస్లను కూడా ఈషా తమవెంట తీసుకువచ్చారు. ముఖేశ్ మనుమరాలికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని పేరుపెట్టారు. ముఖేశ్ కొడుకు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కొడుకు పుట్టాడు. అంటే.. ముఖేశ్ రెండోసారి తాతగా ప్రమోషన్ పొందారన్నమాట.

Latest Articles

‘ఫ్యామిలీ స్టార్’ను కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు: డైరెక్టర్ పరశురామ్

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్