స్వతంత్ర వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు నిన్నటితో వేసవి సెలవులు ముగిసాయి. ఇక ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి. ఈ తరుణంలోనే.. విద్యార్థులు కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మే 14న మొదలైన్ ప్రవేశాలు జూన్ 30తో, ఏపీలో మే 15న ప్రారంభమైన ప్రవేశాలు జూన్ 30వ తేదీలోపు పూర్తి చేయాలనీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్ధులు ప్రవేశాలు పొందాలని తెలియజేస్తూ.. వాటి జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు వెల్లడించారు.నెలన్నర రోజులు సెలవుల తరువాత ఇంటర్ కాలేజీలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు
Latest Articles
- Advertisement -