- రైల్వే మంత్రిగా కేటాయింపులపై అవినీతి కేసులు
- 2021లో ముగిసిన అవినీతి కేసులపై విచారణ
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సీబీఐ ఝలక్ ఇచ్చింది. యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రైల్వే మంత్రి హోదాలో ఆయన చేసిన కేటాయింపులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో ఆయనపై అవినీతి కేసులున్నాయి.ఈ కేసులకు సంబంధించి 2018లోనే సీబీఐ విచారణ ప్రారంభించింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన విచారణ 2021లో ముగిసింది. అయితే ఈ కేసులను తిరిగి తోడాలని సీబీఐ నిర్ణయించుకుంది. బీహార్ లో రాజకీయ పరమైన నిర్ణయాలు శరవేగంగా మారుతున్నాయి. కొన్ని నెలల కిందట భారతీయ జనతా పార్టీతో జేడీయూ తెగతెంపులు చేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ తో జేడీయూ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పాత కేసులను తిరిగి తోడాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది.