34.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

వచ్చే నెల నుంచి ఏపీలో బీఆర్ఎస్ కార్యక్రమాలు..! – పార్టీ సభ్యత్వ నమోదుపై కేసీఆర్ కసరత్తు..!

  • మంత్రి తలసానికి పర్యవేక్షణ బాధ్యతలు
  • అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
  • రేపట్నుంచి సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఏపీ నేతలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాల అమలుకు అధిష్టానం రూపకల్పన చేస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించనుంది. రేపట్నుంచి ఏపీకి చెందిన కొందరు నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Latest Articles

కరీంనగర్ కాంగ్రెస్ ని వీడని పీటముడి

       2024 లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. గెలిచే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు సాగుతున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్