Site icon Swatantra Tv

బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదు: రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్

      బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయ్యిందో చూస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో రాజ్‌ నాథ్‌ పాల్గొన్నారు. కిషన్ రెడ్డి అందరిలా కాదు.. ఆయన అవినీతి నాయకుడు కాదని రాజ్‌ నాథ్‌ అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. బీజేపీ ప్రభు త్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదన్నారు. బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అని రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు. 2047 లోపు దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. మా ప్రభుత్వం వచ్చాకే అయోధ్య రామ మందిరం కట్టామన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకువచ్చామని చెప్పారు.

Exit mobile version