Site icon Swatantra Tv

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

       ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీల కస్టడీ ముగిసింది. భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పాటు పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా వీరి నుంచి కీలక విషయాలను రాబట్టారు. కస్టడీ ముగియడంతో. .. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి వారిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం… నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు… టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్‌ రావును 10రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి.

Exit mobile version