Telangana: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలపై కూలంకషంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్ధేశంలో గత సంవత్సరం ఎనిమిది వైద్య కళాశాలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని… ఇప్పుడు కూడా ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది తొమ్మిది కళాశాలల్లో ఎంబీబీఎస్ వచ్చే విద్యా సంవత్సరానికి మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.