పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకైనట్లు నిర్థారణ కావడంతో ఈనెల 5న జరిగిన పరీక్షను రద్దు చేసింది. 837 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షను 5వేల మంది అభ్యర్థులు రాశారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని TSPSC పేర్కొంది.