Telangana |రాష్ట్రంలో ఇప్పటికే వాయిదా పడిన TS SET 2023 పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.
Read Also: విజృంభిస్తున్న Influenza H3N2 వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!!
Follow us on: Youtube Instagram