స్వతంత్ర, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్ళి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మానవపాడు మండలం పిల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఐదుగురు చిన్నారులు ఈతకు వెళ్ళి.. నదిలో ఆడుతూ మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారులు ఆఫ్రిన్, సమీర్, నౌషిన్, రిహన్ గా గుర్తించారు. మృతులు ఇటిక్యాల మండలం వెల్లూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.