స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం పినపాక వద్ద కారును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని కల్లూరు మండలం లాక్యాతండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ కారును కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు చెప్పారు.