స్వతంత్ర, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లాడ్జీలో ఓ నకిలీ వైద్యుడి చేతివాటం ప్రదర్శించాడు. ట్రీట్మెంట్ పేరుతో మహిళకు మత్తుటాబ్లెట్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటి పైన ఉన్న బంగారం తో పరారయ్యాడు. దీంతో స్పృహ వచ్చాక దోపిడీ జరిగిందని తెలుసుకొన్న మహిళ.. గోపాలపురం పోలీసులకు భాదితురాలు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆసుపత్రి సర్జన్ గా పరిచయం చేసుకున్న నకిలీ వైద్యుడు.. రైళ్ళో మహిళ ను పరిచయం చేసుకోని ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.