34.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

నేడు, రేపు వర్షాలు… పలుచోట్ల పిగుడులు పడే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండ్రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అధేవిధంగా ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Latest Articles

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్‌

   పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచశాంతిని కోరుకునేవారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్నెల్లు గా హమాస్‌- ఇజ్రాయెల్‌కు పరిమితమైన ఘర్షణలు ఇప్పుడు ప్రపంచం అంతటికీ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్