34.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

వైభవంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌ మైదానంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, నారా చంద్రబాబు నాయుడు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. నందమూరి కుటుంబసభ్యులు బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటుగా రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా, సినీ ప్రముఖులు వెంకటేశ్‌, జయప్రద, జయసుధ, మురళీ మోహన్‌, రామ్‌ చరణ్‌, బాబు మోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్‌ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, నాగచైతన్య, సుమంత్‌, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్‌ వంటి పలువురు సినీ తారలు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Latest Articles

మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

   నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్