35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

బిగ్ బ్రేకింగ్: EDకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాం లో మార్చ్ 10 వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ నోటీసులు పంపింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కవిత బినామీగా పేర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆమెను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

కాగా ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ తనని ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టాలను గౌరవిస్తూ అధికారులకు విచారణలో సహకరిస్తానని తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ నెల 10 న దీక్షలో పాల్గొనడంతోపాటు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో విచారణ తేదీని మార్చాలంటూ.. న్యాయ సలహా తీసుకుని ఈడీ అధికారులను కోరతానని ఆమె తెలిపారు.

న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. 10న ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని ఆమె లేఖలో పేర్కొన్నారు.  15న హాజరవుతానని సమయం కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరణ ఇచ్చారు. ఈడీ నుండి సమాచారం వచ్చాక ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు.

Read Also: వై.ఎస్. షర్మిల అరెస్ట్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘శ్రీ‌రంగ‌నీతులు’ ట్రైల‌ర్ విడుద‌ల

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్