స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మరోసారి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ‘బీఆర్ఎస్’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ అని ఊరికే అనలేదు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి.. రక్తమోడేలా దాడి చేసి.. చంపేస్తామంటూ బెదిరించడం బంధిపోట్లకే సాధ్యం. అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు. దళితబంధు అక్రమాలను ఎత్తిచూపిన అడ్వకేట్ యుగేందర్ మీద బీఆర్ఎస్ గూండాల దాడిని వైఎస్ఆర్టీపీ తీవ్రంగా ఖండిస్తుందని వ్యాఖ్యానించారు. దళితుల జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం వైఎస్ఆర్టీపీ పోరాడుతుందని తెలిపారు. బంధిపోట్ల రాష్ట్ర సమితి అంటే నాపై హుటాహుటిన కేసు నమోదు చేయించిన కేసీఆర్.. దళిత న్యాయవాదిపై దాడికి దిగిన BRS బంధిపోట్లకు మాత్రం గొడుగు పడుతున్నారని అన్నారు.
దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదు. మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ప్రజలకు న్యాయం లేదు! న్యాయవాదులకు రక్షణ లేదు! బంధిపోట్ల దాష్టీకాలకు అడ్డూఅదుపూ లేదు! అందుకే అన్నాం.. టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని.. బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి.. అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.