తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. నిర్ణీత సమయం ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. ప్రగతిభవన్ లో జరిగిన BRS విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీచేశారు. పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ సభలకు పోటీగా నియోజకవర్గాల వారిగా సభలు పెట్టండన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టండని నేతలకు వెల్లడించారు. సమావేశం ప్రారంభానికి ముందు దివంగత నేత సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేసీఆర్.